కరీంనగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా హుజురాబాద్ మండలంలోని రంగాపురం గ్రామ ఉప సర్పంచ్ సామల హంసరెడ్డితో పాటు మరో 20 మంది బీజేపీ కార్యకర్తలు బుధవారం టిఆర్ఎస్లో చేరారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే, హుజురాబాద్ పార్టీ ఇంచార్జీ వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వారు బీజేపీకి రాజీనామా చేసి పోరెడ్డి కిషన్ రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ సంగెం అయిలయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రంగాపురం గ్రామానికి చెందిన 8 మంది బీజేపీ వార్డు సభ్యులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఐలయ్య తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు