రైల్వే స్టేషన్లో ఇద్దరు పిల్లల పక్కనే పడుకొని నిద్రపోతోందా తల్లి. తెల్లారుజామున 4 గంటలకు భర్త వచ్చి ఆమెను బలవంతంగా నిద్రలేపాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే.. ఆమెను లాక్కొచ్చి ఎక్స్ప్రెస్ రైలు కింద పడేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడా వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయ్ రోడ్ రైల్వేస్టేషన్లో వెలుగు చూసింది.
ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఇలా భార్యను చంపేసిన తర్వాత వేరే రైలు ఎక్కి పారిపోయిడా వ్యక్తి. రెండు రైళ్లు మారి థానే చేరుకున్నాడు. అక్కడి భివాండీ టౌన్లో ఉండగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి భార్య కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, నిందితుడి స్నేహితుడితో వెళ్లి రెండ్రోజుల తర్వాత తిరిగొచ్చిందని, దీంతో ఆమె క్యారెక్టర్పై అనుమానంతోనే హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
#Mumbai: A man, in his 30s, threw his sleeping wife in front of a speeding long distance train at #Vasai railway station and fled with his two minor children on Monday morning. Search launched for him. pic.twitter.com/XRL2rOdQbt
— TOI Mumbai (@TOIMumbai) August 22, 2022