తిరుమలగిరి(సాగర్), మార్చి 29 : సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్ విజయం తథ్యమని ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, రమావత్ రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నోముల భగత్ 30వేల మెజార్టీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు, మారుమూల తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కృష్ణపట్టె ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ప్రతి ఎకరాకు సాగునీరందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇస్తామని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పిడిగం నాగయ్య, కట్టెబోయిన అనిల్కుమార్యాదవ్, గజ్జెల శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ ఏడుకొండల్ పెద్ది రాజు పాల్గొన్నారు.