ప్రశ్నించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
పెద్దవూర/త్రిపురారం, మార్చి 19: గతంలో సాగర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేత జానారెడ్డి పదవుల కోసం తప్ప ఏనాడన్నా ప్రజా సమస్యలను పట్టించుకున్నారా అని విప్, పెద్దవూర మండల ఉపఎన్నికల ఇంచా ర్జి బాల్క సుమన్ ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం కుంకుడుచెట్టు, గేమ్యానాయక్ తండా లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ ఆధ్వర్యంలో పలు తండాలకు చెందిన 85 మంది యువకులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా చేశారన్నారు. త్రిపురారం మండలంలో ఎమ్మెల్యే, మండల ఎన్నికల ఇంచార్జి శంకర్నాయక్ సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు.