శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 3.59లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,41,748, విద్యుదుత్పత్తి ద్వారా 26,361, సుంకేశుల నుంచి 90,942 క్యూసెక్కుల వరదను అధికారులు వదులుతున్నారు.
శనివారం సాయంత్రం వరకు 4,25,563 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా పది గేట్లను 15 అడుగుల మేర పైకెత్తి 3,76,170, కుడి ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 61,024 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 884.30 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వలు 215.80 టీఏంసీలకుగాను 211.47 టీఏంసీలుగా నమోదైంది.