నల్లగొండ: నాగార్జున సాగర్కు వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 1,11,310 క్యూసెక్కుల వరద వస్తుండగా, 9,154 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత 543.50 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలుకాగా, 195.6975 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4,60,154 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు పది క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో 1,11,310 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటిమట్టం 884.40 అడుగులున్నది. పూర్తిస్థాయి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 212.38 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.