మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటం, నారాయణపూర్ ప్రాజెక్టుకు గేట్లు ఎత్తివేయడంతో జలాశయంలోకి 38,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. భారీగా వరద వస్తుండటంతో 21,341 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.325 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎగువ జూరాలలో 3 యూనిట్లు, దిగువ జూరాలలో 3 యూనిట్ల చొప్పున విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు.