మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువన భారీగా వరద వస్తుండటంతో.. ప్రాజెక్టులోకి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 1,51,653 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.68 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులో 9.65 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ప్రస్తుతం 7.99 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.