చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కుమారుడైన ఉదయనిధిపై తాను తప్పక గెలుస్తానని పట్టాలి మక్కల్ కచ్చి(పీఎంకే) అభ్యర్థి ఏవీఏ కసాలి ధీమా వ్యక్తం చేశారు. చెపౌక్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఉదయనిధి స్టాలిన్కు వ్యతిరేకంగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఎన్నికల గుర్తు మామిడి కాయతో కసాలి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ట్రిప్లికేన్ మార్కెట్ ప్రాంతంలో మామిడి పండ్లు అమ్ముతూ జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఉదయనిధి స్టాలిన్కు ప్రచారం గురించి పట్టదని కసాలి విమర్శించారు. ఈ నేపథ్యంలో చెపౌక్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.