కరోనా కట్టడిలో సత్ఫలితాలు: డాక్టర్ అశోక్
ఖైరతాబాద్, ఆగస్టు 1: రోగ నిరోధక శక్తికి హోమియోపతి వైద్యం ఉపయుక్తంగా ఉంటుందని హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు. బైక్పైనే 89 రోజుల్లో 24 జిల్లాలు, 8,960 కిలోమీటర్లు ప్రయాణించి కరోనాకు ఉచితంగా హోమియోమందులు అందజేసిన ఆయన ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. కరోనాను కట్టడి చేయటంలో హోమియోపతి మందు ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ప్రభావవంతంగా పనిచేస్తున్నదని, ఆయుష్శాఖ సైతం ఈ మం దును పరీక్షించిందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 140 కేసులను విజయవంతంగా పరిష్కరించామని, ప్రతి ఇంటికి ఈ వైద్యం చేరాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.