ములుగురూరల్/మహాముత్తారం , ఏప్రిల్4: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే సీతక్క ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, కొత్తగూడ, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాల 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ బాధిత కుటుంబాలకు రూ.10,65,500 నిధులు మంజూరయ్యాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మావురపు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నల్లెల్ల కుమారస్వామి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బానోత్ రవిచందర్, చాంద్పాషా, సూర్యనారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మహాముత్తారం మండలంలోని ములుగుపల్లికి చెందిన చీకట్ల రమకు మంజూరైన రూ.22,000 విలువైన సీఎం ఆర్ఎఫ్ చెక్కును పీఏసీఎస్ చైన్మన్ సోమ శాంతకుమార్ అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మార్క రాముగౌడ్, సర్పంచ్లు దూలం మల్లయ్యగౌడ్, ముక్కేర నవీన్గౌడ్, ఎంపీటీసీ శ్రీపతి సురేశ్గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మహ్మద్ అల్లాఉద్దీన్, రైతు బంధు సమితీ జిల్లా సభ్యుడు వెంకటయ్య, రాజయ్య, సమ్మక్క పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
సారీ.. ఆ లోగో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2000 కోట్ల భారం! ఎందుకంటే!!