రంగారెడ్డి : కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలన్నారు. రాష్ట్ర్రాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు