హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): బీసీ-ఈ క్యాటగిరీ కింద నాలుగు శాతం రిజర్వేషన్లను మరో పదేండ్లు పొడగించినందుకు ముస్లింల తరఫున సీఎం కేసీఆర్కు హోంమంత్రి మహమూద్ అలీ శనివారం కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పెంపుతో ఎంతోమంది ముస్లిం విద్యార్థులు విద్య, ఉపాధి రంగాల్లో లబ్ధిపొందుతారని చెప్పారు. మరోవైపు, మక్కా మసీదు ఉద్యోగుల జీతాల చెల్లింపు సమస్యను వెంటనే పరిష్కరించాలని మైనార్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్కు మహమూద్ అలీ సూచించారు.