లండన్, మార్చి 16: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్ నెలాఖరులో భారత్లో పర్యటించనున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చిన తర్వాత ఆయన తొలి ప్రధాన అంతర్జాతీయ పర్యటన ఇదేనని డౌనింగ్ స్ట్రీట్ (బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం) ప్రకటించింది. పర్యటనలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని అవకాశాలను మెరుగుపరుచుకోవాలని బ్రిటన్ భావిస్తున్నది. ఇండియా-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా వెళ్లాలని యోచిస్తున్నది.