హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి చేతికి చిక్కి హోంఐసొలేషన్లో ఉండేవారి తిప్పలు వర్ణణాతీతం. బయటకు వెళ్లలేక పాలు, కూరగాయలు, నిత్యవసరాలు తెచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి తీర్చుకొనేందుకు, కడుపు నింపుకొనేందుకు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక ఇంటిల్లిపాది కరోనా బారిన పడితే పడే అవస్థలు అన్ని ఇన్నీ కావు. ఈ క్రమంలో పలు సంస్థలు ముందుకొచ్చి కరోనా రోగులకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. మానవత్వంతో స్పందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉచితంగా ఆహారం సమకూరుస్తుండగా.. మరికొందరు డబ్బులు తీసుకొని భోజనాన్ని కొవిడ్ బాధితుల ఇంటికే సరఫరా చేస్తున్నాయి.