పాలకుర్తి, జూలై 23: మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పిలుపుతో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఓ నిరుపేద వృద్ధురాలికి ఇల్లు నిర్మించి ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. బసంత్నగర్ రాజీవ్నగర్కు చెందిన వృద్ధురాలు లక్ష్మి నిలువ నీడ లేకపోవటంతో ఓ చెట్టుకింద పరదాలతో గుడిసె వేసుకొని నివసిస్తున్నారు. ఆమె కష్టాలు చూసి చలించిపోయిన సంధ్యారాణి, ఓ ఇంటిని నిర్మించి ఇచ్చారు. శుక్రవారం గృహప్రవేశం చేశారు.