విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు
వేసవి సెలవులు 20 వరకు పొడిగింపు
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను ఈ నెల 20 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, మోడల్స్కూళ్లు, కేజీబీవీ పాఠశాలలతో పాటు, డైట్కాలేజీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇంటర్ ప్రవేశాల కోసం ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుందని, ఆయా కళాశాలలు నాన్టీచింగ్ స్టాఫ్ను సర్దుబాటు చేసుకోవాలని ఇంటర్బోర్డు కార్యదర్శి సూచించారు.