హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్కు న్యాయశాస్త్రంలో అత్యున్నత పరిశోధన డిగ్రీ దక్కింది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఆయనకు మంగళవారం ఎల్ఎల్డీ డిగ్రీని ప్రదానం చేసింది. ప్రతిరోజు కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాల్లో వేల ఆర్టీఐ దరఖాస్తులను ఏ విధంగా పట్టించుకోవడం లేదనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ పరిశోధనకుగానూ ఈ డిగ్రీని ప్రదానం చేసింది. ఎల్ఎల్డీ డిగ్రీ ఇతర సబ్జెక్టుల్లో ఇచ్చే లిటరేచర్తో సమానం.