మంచిర్యాల : ఆయిల్ పామ్ తో రైతులు అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు పండించాలన్నారు. హైదరాబాద్లోని హాకా భవన్లో మంగళ వారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన సమావేశంలో విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విప్ సుమన్ మాట్లాడుతూ.. 30 ఏండ్ల పాటు సుదీర్ఘకాలంగా లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.చెన్నూర్ నియోజకవర్గంలో రైతులు అంతర పంటలుగా కర్బూజ, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు వేసుకొని అధిక లాబాలు గడిస్తున్నారని పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ దిగుబడికి ముందే పెట్టుబడి వెళ్లిపోతుందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్ రామ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం