ఓసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు రామారావు
కమలాపూర్, ఏప్రిల్ 11 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాండ్ చేశారు. కమలాపూర్ కమ్యూనిటీహాల్లో ఆదివారం రైతు మహాగర్జన సభ పోస్టర్ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని లక్షలాది మంది రైతులతో ఈనెల 23న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో రైతుగర్జన సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహాగర్జనకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు, ప్రజాసంఘాల నాయకులను ఆహ్వానించామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలు అమలైతే రైతు కూలీగా మారుతాడని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాలు ధాన్యం ధర రూ.2500కు పెంచాలని, 50 ఏళ్లు పైబడిన రైతులకు 5వేల పింఛన్ ఇవ్వాలని, బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని రామారావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలోఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సంపత్రావు, ఓసీ సంఘాల నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, బిల్లా రాజిరెడ్డి, కట్కూరి తిరుపతిరెడ్డి, నాయినేని రమేశ్రావు, విష్ణుదాసు వంశీధర్, పెండ్యాల తిరుపతిరెడ్డి, సమ్మిరెడ్డి, మధుసూదన్రెడ్డి, పుల్లూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.