కొడంగల్, జూన్ 19: పసరు మందు కోసం కర్ణాటకలోని యాద్గిరి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్లో శనివారం ఉదయం చోటుచేసుకున్నది. కర్ణాటకలోని సేడానికి చెందిన మౌలాన్బీ(58) హైదరాబాద్ ఆసిఫ్నగర్లోని జిర్రా ప్రాంతంలో స్థిరపడ్డారు. పదిరోజుల క్రితం మౌలాన్బీ చెయ్యి విరగడంతో కర్ణాటకలోని యాద్గిర్లో పసరు మందు కోసం కారులో కొడుకులు బాబుమియా (38), మహ్మద్ అబ్దుల్ (35), మనుమడు మహ్మద్ రశీద్(27)తో కలిసి బయలుదేరారు. కొడంగల్ శివారులోని మౌలాన్బీ కుటుంబం ప్రయాణిస్తున్న కారు వెనుక టైరు పగిలింది. దీంతో ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొట్టడంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో మౌలాన్బీతోపాటు ఇద్దరు కొడుకులు, మనుమడు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.