హైదరాబాద్ : కరోనా బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా ఇవాళ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కోవా లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని ఆయన సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.