కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.. పోలీసు సిబ్బంది తగు జాగ్రత్త పాటించాలి.. ఫిర్యాదు చేయడానికి ఎవరైనా వస్తే ఆరడుగుల దూరం ఉండేలా చూడాలి.. బాధితులు తప్పని సరి అయితేనే పోలీస్ స్టేషన్కు రావాలి.. ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు .. అని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.. కనోనా నేపథ్యంలో సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా లక్షణాలు ఉంటే పై అధికారులకు సమాచారం అందించి.. హోం ఐసోలేషన్కు వెళ్లాలని సూచించారు.. ఒక పక్క ప్రజలకు సేవలు అందిస్తూ .. మరో పక్క తమకు తాముగా సురక్షితంగా ఉండేందుకు ఏమీ చేయాలి.. అధికారుల బృందం పనిచేసే చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే పలు అంశాలపై సీపీ సూచనలు చేశారు.