హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఓబుళాపురం మైనింగ్ కేసు(ఓఎంసీ)లో విచారణ చేయకుండా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. మైనింగ్ జరిగిన స్థల సరిహద్దు వివాదం ఏపీ, కర్నాటక మధ్య ఉందని, ఆ వివాదం తేలేవరకూ సీబీఐ కోర్టు ఓఎంసీ కేసు విచారణ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆమె వాదనను తోసిపుచ్చుతూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పు వెలువరించారు. ‘మైనింగ్ లీజు మంజూరులో నిబంధనలను ఉల్లంఘించారని శ్రీలక్ష్మిని ఏడో నిందితురాలిగా చేస్తూ సీబీఐ కేసు నమోదుచేసింది. దర్యాప్తు దశలోనే అడ్డుకోవడం సరికాదు. సీఆర్ పీసీలోని 482 కింద నిందితులపై నమోదైన కేసులను కొట్టేసే విశేషాధికారాలు హైకోర్టులకు ప్రత్యేక సందర్భాల్లోనే ఉంటాయని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఓఎంసీ కేసు 2012లో నమోదైంది.. అంటే తొమ్మిదేళ్లు అయ్యింది. ఇంకా డిశ్చార్జి పిటిషన్ల దశలోనే ఉంది. అందరికీ చట్ట ప్రకారం అవకాశం ఇవ్వాలి. సీఆర్పీసీలోని 282 సెక్షన్ కింద కేసును కొట్టేయాల్సిన పరిస్థితులు ఇకడ లేవు. రెండు రాష్ట్రాల మధ్య భూసరిహద్దు వివాదం తేలేవరకూ సీబీఐ కోర్టులో విచారణను నిలిపివేయాలన్న మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’అని హైకోర్టు తీర్పులో పేరొంది.