మహబూబ్ నగర్ : వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు పాటించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో ఆల శశివర్ధన్ రెడ్డి పొలంలో యంత్ర సహాయంతో వేస్తున్న వరి నాటును ఆయన పరిశీలించారు. గత సంవత్సరం వరి నాటు యంత్రం సహాయంతో వేయడం వల్ల పెట్టుబడి తగ్గడంతోపాటు పంట ఎక్కువగా వచ్చిందని రైతులు చెప్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
నూతన వ్యవసాయ విధానాలను పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించడమే కాకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి వర్తింపచేయాలని సూచించారు. రైతువేదికల ద్వారా నిత్యం వ్యవసాయాధికారుల ద్వారా తగు సూచనలు పొందాలని రైతులను కోరారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు