ఖమ్మం : తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సార్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ 16వ డివిజన్ కొత్తూర్ సర్కిల్లో గల సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారిని స్మరించుకున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రంలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపారన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సుడా చైర్మన్ విజయ్ కుమార్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు