హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స కోసం రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక బై ప్లేస్ న్యూరో-క్యాథ్ ల్యాబ్ను సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చింది. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా శుక్రవారం ఈ ల్యాబ్ను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రారంభించారు. 50 ఏండ్లు దాటినవారికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉన్నందున ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఆమె సూచించారు. డైరెక్ట్ టు ఆంజియో సూట్ (డీటీఏఎస్) టెక్నాలజీతో పనిచేసే బై ప్లేస్ న్యూరో ఆంజియో ప్రొసీజర్ సూట్ అనే ప్రపంచస్థాయి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తేవడం రాష్ర్టానికే గర్వకారణమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ గోరుకంటి చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినవారిని ఎంత వేగంగా స్ట్రోక్ సెంటర్కు తీసుకొచ్చి ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంతే మంచి ఫలితం ఉంటుందని ఆ హాస్పిటల్స్ సీనియర్ న్యూరో, ఇంటర్వెన్షనల్ రేడియోలాజిస్ట్ సురేశ్ గిరిగాని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కోమల్కుమార్, పలువురు న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు పాల్గొన్నారు.