హైదరాబాద్ : వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి మంటలు అంటుకొని వ్యక్తి సజీవ దహనం కాగా నాలుగు టిప్పర్లు, ట్రాక్టర్ దగ్ధమయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి ప్రాజెక్టు వద్ద ఆదివారం ఈ దుర్ఘటన ఘటన జరిగింది. ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికులు సమీపంలో తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసుకున్నారు.
వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడి చూస్తుండగానే వ్యాపించాయి. మంటలు అంటుకొని కూలీల్లోని ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.
సమీపంలోని 4 టిప్పర్లు, ట్రాక్టర్ సైతం మంటల ధాటికి దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఘటనతో కూలీలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.