కుమ్రం భీం అసిఫాబాద్ : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతో ఆసరగా నిలుస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో నార్నూర్ మండలానికి చెందిన దాదే అలీకి సీఎం సహాయనిధి 60,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో వాంకిడి మండల జెడ్పిటిసి అజయ్ కుమార్, ఎంపిటిసి జై రాం, సరండి సర్పంచ్ కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ