ఆర్థిక సాయం, భోజన ప్యాకెట్లు.. అందజేసిన ‘మెట్రో లీగల్ అథారిటీ’
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు/ నాంపల్లి, మే 16 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో వలస కూలీలకు మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండగా నిలుస్తున్నది. అథారిటీ కార్యదర్శి రాధాకృష్ణచౌహాన్ ఆదేశాల మేరకు సంస్థ ప్రతినిధులు అరుణ్కుమార్, వీణ, సంగీత, వలంటీర్లు రంజిత్యాదవ్, కార్తీక్, బ్రహ్మం.. లక్డీకాపూల్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లోని దాదాపు 250 మందికిపైగా వలస కార్మికులకు ఆర్థిక సాయం అందజేశారు. భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. రాధాకృష్ణ చౌహాన్ ఆదివారం నింబోలిఅడ్డలోని బాలికల వసతిగృహాన్ని సందర్శించి.. కొవిడ్ నుంచి కోలుకున్న 16 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.