వరంగల్ రూరల్ : హలో నేను మీ ఎమ్మెల్యేను మాట్లాడుతున్నాను..ఆరోగ్యం ఎలా ఉందంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కరోనా బాధితులతో ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు కరోనా బాధితులకు ఫోన్ చేసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యాన్ని కోల్పోకుండా మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన అన్నారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రజలకు సూచించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ సామజిక దూరం పాటించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు