హైదరాబాద్: దసరా పండుగ కోసం ఊళ్లకు వెళ్లిన వారంతా మళ్లీ భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ వచ్చే మార్గంలో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దసరా పర్వదినం సందర్భంగా గ్రామాలకు వెళ్లి, తిరిగి వస్తున్న వాహనాల వల్లే ఇంత రద్దీ ఏర్పడినట్లు సమాచారం. ఇంతగా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.