హైదరాబాద్ : బంగారం స్మగ్లింగ్ కేసులో ఘనశ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కొడుకు ప్రీత్కుమార్ అగర్వాల్ను ఎన్ఫోర్స్మెట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారం విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఇతడిపై అభియోగం నమోదైంది. కోల్కతా డీఆర్ఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.కోల్కతా విమానాశ్రయంలో 2018లో అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 250 కిలోల బంగారం అక్రమంగా మళ్లించినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని ఐదు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్లు సోదాల్లో గుర్తించింది. ప్రీత్కుమార్ అక్రమార్జనతో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ గుర్తించినట్లుగా సమాచారం.