కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జగిత్యాల జిల్లాలోని కథలాపూర్లో అత్యధికంగా 145.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రాంగిలో 110.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లాలోని గోవిందరాంలో 119.0మి.మీ. వర్షపాతం నమోదైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇల్లంతకుంటలో 90.8 మి.మీ., మల్లారంలో 80.0 మి.మీ., బోయిన్పల్లిలో 60 మి.మీ., గజసింగారంలో 58.8 మి.మీ., గంభీరావుపేటలో 56.5 మి.మీ., నాంపల్లిలో 56.0 మి.మీ., పెద్దలింగాపూర్లో 50.6 మి.మీ., మర్రిగడ్డలో 50.0 మి.మీ., వట్టెంలలో 46.3 మి.మీ., ఆవునూరులో 35.5 మి.మీ., ఎల్లారెడ్డిపేటలో 34.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
కరీంనగర్ జిల్లా పరిధిలోని రేణికుంట, చిగురుమామిడిలో 85.9 మి.మీ., వెంకిపల్లిలో 72.0, వీణవంకలో 58.0, బోర్నాపల్లిలో 54.3, గట్టుదెద్దనపల్లిలో 52.5, ఈదుల్లగట్టెపల్లిలో 50.0, నుస్తులాపూర్లో 50.0, గంగిపల్లిలో 43.8, కొత్తగట్టులో 37.8, పోచంపల్లిలో 36.8, జమ్మికుంటలో 30.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.