Heavy Rains | రాష్ట్రంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. మంచిర్యాల, భూపల్లిపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, జగిత్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొల్లూరులో 17.3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్ డీపీఎస్ తెలిపింది.
ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవ్పూర్లో 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నీల్వాయి (మంచిర్యాల) 13.6, మహదేవ్పూర్ (జయశంకర్)లో 12, సర్వాయిపేట (జయశంకర్)లో 11.9, పాల్తెం (పెద్దపల్లి)లో 10.9, మన్నెగూడెం (జగిత్యాల)లో 10.6, కాటారం (జయశంకర్)లో 10.3, మడిపల్లి (జగిత్యాల)లో 10, మొగుళ్లపల్లి (జయశంకర్) 8.6, చెల్పూరు (జయశంకర్) కొత్తపల్లి (మంచిర్యాల) 13.5, చెల్పూర్ (జయశంకర్)లో 8.2, కాళేశ్వరం (జయశంకర్)లో 8, ములుగు జిల్లా తాడ్వాయిలో 7.2, సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు టీఎస్ డీపీఎస్ వివరించింది.