హైదరాబాద్: రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని, రేపు కూడా చాలా ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, సోమవారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా సిద్దిపేట జిల్లా హబ్షీపూర్లో 16.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఇక మల్కాజిగిరిలోని మెట్టుగూడలో 13.7 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో 12.8 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్లో 11.7 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో 11.4 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర్లలో 11 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 11 సెంటీమీటర్లు, సిద్దిపేటలో 10.9, చేర్యాలలో 10.6, ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలో 10.5, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారంలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.