హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జార్ఖండ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దీంతో రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశలనుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రదేశాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది.