భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో తన హవా కొనసాగిస్తున్న షియోమీ.. స్మార్ట్టీవీల రంగంలోనూ దూసుకెళ్తోంది. అత్యంత ఖరీదైన స్మార్ట్టీవీని షియోమీ భారత్లో ఆవిష్కరించింది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 పేరుతో అతిపెద్ద స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈజీ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 7,500 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది. భారత్లో టీవీ ధర రూ.1,19,999గా నిర్ణయించారు. శాంసంగ్, సోనీ వంటి ఇతర బ్రాండ్లలో 75 అంగుళాల స్మార్ట్టీవీల కన్నా ఈ టీవీ ధర తక్కువే.
షియోమీ తన స్మార్ట్టీవీలను భారత్లోనే తయారు చేయడం ప్రారంభించింది. దీంతో టీవీల తయారీ ఖర్చు తగ్గింది. సరికొత్త టీవీలో సినిమాలు లేదా వీడియో కంటెంట్ చూసేటప్పుడు థియేటర్లో చూస్తోన్న అనుభూతిని కలుగుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, ఫ్లిప్కార్ట్ ద్వారా టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి. 3,799 విలువైన ఎక్స్టెండెడ్ వారంటీని అందిస్తోంది. ఏడాదిపాటు అదనంగా ఎంఐ టీవీ ప్రొటెక్షన్ ఉంది.
మోడల్: 75 అంగుళాల QLED TV 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ
రిజల్యూషన్: ఆల్ట్రా హెచ్డీ
3డీ: లేదు
స్మార్ట్టీవీ: అవును
కర్వ్ టీవీ: లేదు
సిరీస్: Mi TV Q1
యాప్ స్టోర్ టైప్: గూగుల్ ప్లే స్టోర్
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ టీవీ 10