గువాహటి: అసోం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ ముందుకు కదులుతున్నది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. అసోంలోని మొత్తం 98 స్థానాలకు గాను 50 నియోజకవర్గాల్లో బీజేపీ దూసుకుపోతున్నది. అలాగే, ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్డీఏలో అసోం గణపరిషత్తోపాటు యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ కూడా ఉన్నాయి. ఈ కూటమికి మొత్తంగా 67 స్థానాల్లో మెజార్టీ ఉన్నది. అసోం గణ పరిషత్ 11 స్థానాల్లో, మరో పార్టీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అభ్యర్థులు 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
కాగా, యూపీఏ అభ్యర్థులు 36 సీట్లలో మెజార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు 19 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు 9 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థులు రెండు చోట్ల మెజార్టీ దిశగా సాగుతున్నారు. యూపీఏతో జతకట్టిన సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆంచలిక్ గణ మోర్చాలకు ఒక్క స్థానంలోనూ మెజార్టీ రాలేదు.
ఇలాఉండగా, ముఖ్యమంత్రి సరబానంద సోనోవాల్తోపాటు ఆరోగ్య మంత్రి హిమంత బిష్వా, అసోం గణ పరిషత్ చీఫ్ అతుల్ బోరాలు ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అసోం శాఖ చీఫ్ దేబబ్రత సైకియా, డిప్యూటీ చీఫ్ రకిబుల్ హుస్సేన్లో వెనుకంజలో ఉన్నారు.
ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
పుదుచ్చరిలో ముందంజలో ఎన్డీఏ కూటమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..