న్యూఢిల్లీ: కరోనా వైరస్తో పోరాడుతున్న భారత్కు సాయం చేసేందుకు టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్, వెస్టిండీస్ బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ ముందుకొచ్చారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించడంతో పాటు వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థకు ధవన్ రూ.20 లక్షలు విరాళమిచ్చాడు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల్లో తన వ్యక్తిగత ప్రదర్శనకు దక్కే అవార్డుల మొత్తాన్ని కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. కాగా ఐపీఎల్ కాంట్రాక్టులో తనకు వచ్చే మొత్తంలో కొంత భాగం విరాళంగా ఇవ్వనున్నట్టు పూరన్ తెలిపాడు. అలాగే కరోనా బాధితులకు వైద్య సదుపాయాల కోసం రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఉనాద్కత్ ఐపీఎల్ సంపాదనలో 10 శాతం విరాళంగా ప్రకటించాడు.