సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూర్(యస్) మండలం రామన్నగూడెం, ఏపూర్ గ్రామాల నుంచి వివిధ పార్టీల నుంచి 300 మంది మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఆత్మకూర్(యస్) ఎంపీపీ మర్ల స్వర్ణలత, సర్పంచ్లు, ఎంపీటీసలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి