శంకర్పల్లి, ఏప్రిల్ 22 : రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి ఎంతో కృషి చేశారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కొనియాడారు. గురువారం ఇంద్రారెడ్డి వర్ధంతిని శంకర్పల్లి ప్రధాన చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జి.గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.గోపాల్, వి.వాసుదేవ్కన్నాలు, నాయకులు కె.నారాయణ, జి.గోవర్ధన్రెడ్డి, గోపాల్రెడ్డి, సాత ప్రవీణ్కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మండలంలోని మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్లో సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రవీందర్గౌడ్ ఇంద్రారెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాములమ్మ, కె.వెంకటేశ్, కిషన్సింగ్ పాల్గొన్నారు.
ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు కృషి చేద్దాం
శంకర్పల్లి రూరల్, ఏప్రిల్ 22 : శంకర్పల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతిని ఆయన అభిమానులు పలువురు రాజకీయ పార్టీల నాయకులు నివాళులర్పించారు.
వ్యాపారస్తుల నిర్ణయం హర్షణీయం
శంకర్పల్లి, ఏప్రిల్ 22 : శంకర్పల్లి పట్టణ వ్యాపారస్తులు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు తమ వ్యాపార సంస్థలు మూసి వేస్తామని నిర్ణయించుకోవడం హర్షణీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ వ్యాపారస్తులు ఎమ్మెల్యే సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూకు పూర్తి స్థాయిలో సహకరించాలనే ఉద్దేశంతో రెండు గంటల ముందుగానే తమ వ్యాపార సంస్థలు మూసి వేస్తామని వ్యాపారులు చెప్పడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బీ.వెంకట్రాంరెడ్డి, కమిషనర్ యాదగిరి, సీఐ గోపీనాథ్, వ్యాపారస్తులు పాల్గొన్నారు.