ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో రోహిత్ శర్మ(35) ఔట్ కాగా, జడేజా వేసిన తర్వాతి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(3) పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై 77 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. 9 ఓవర్లకు ముంబై 2 వికెట్లకు 80 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(38), కృనాల్ పాండ్య(1) క్రీజులో ఉన్నారు. ముంబై విజయానికి ఇంకా 66 బంతుల్లో 139 పరుగులు చేయాల్సి ఉంది.