మహబూబ్నగర్/ సూర్యాపేట : తెలంగాణ-ఏపీ సరిహద్దు చెక్పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి అంబులెన్స్, సరకు రవాణా, అత్యవసర, ఈ-పాస్లున్న వాటిని మినహా ఇతర వాహనాలను వేటిని తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీంతో అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపూర్ చెక్పోస్టుతోపాటు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని పూల్లూరు టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
లాక్డౌన్ సడలింపు ఉంటుందన్న భావనతో ఏపీ నుంచి భారీగా వాహనదారులు తరలివచ్చారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ పోలీసులను ఆదేశించడంతో ఈ మేరకు పోలీసుశాఖ దృష్టిపెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం పొంచి ఉండటంతో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటం.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో ఇంకాస్త కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.