సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): సైక్లింగ్..ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలియనిది కాదు. మారుతున్న జీవన విధానంలో దీని వినియోగాన్ని మరింత పెంచేందుకు ఆయా సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కరోనా ఆపత్కాలంలో ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యమో చాటి చెప్పేందుకు సైక్లింగ్ లీగ్ వేదిక సిద్ధమైంది. హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ (హెచ్సీజీ) ఆధ్వర్యంలో నగరంలో ఈనెల 21న అతిపెద్ద సైక్లింగ్ లీగ్ జరగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా సైక్లిస్టులు పాల్గొంటుండగా, ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ముగ్గురు సైక్లిస్టులు కలిసి ఒక టీంగా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి 60 టీంలు రిజిస్టర్ చేసుకున్నాయి. నెలరోజుల వ్యవధిలో 2వేల కిలోమీటర్లకు మించి సైక్లింగ్ చేసిన టీంలను విజేతగా ప్రకటిస్తారు. మొదటి టీంకు రూ.20వేల ప్రైజ్ మనీ, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10వేలు అందజేస్తారు. మిగిలిన వారిని అవార్డులతో సత్కరిస్తారు. ప్రతియేటా జూన్ 21న నిర్వహించే ఈ పోటీలకు ప్రస్తుతం స్పందన బాగా కనిపిస్తున్నది. ఈ లీగ్ ద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ ఫీజును కొవిడ్ బాధితులకు అందజేయనున్నారు.
8 వేల సభ్యులుండే హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ 2017 నుంచి సైక్లింగ్ ప్రాధాన్యతను చాటిచెబుతున్నది. హెచ్సీజీ ఫౌండర్ రవీందర్ నందనూరి ఈ లీగ్లను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు,న్యాయవాదులు, వైద్యులు, పోలీసులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, వృద్ధులు ఈ లీగ్లో పాల్గొనేలా 16ప్లస్, 60 ప్లస్ విభాగాలుగా పోటీలు జరగనున్నాయి. రిజిస్టర్ ఫీజు రూ.499. ఆసక్తి గలవారు https://hyderabadcyclistsgroup.com/hcg-cycling-league-2/లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈనెల 19 వరకు అవకాశం ఉంది. జులై 21 వరకు అంటే నెలరోజులపాటు సైక్లింగ్ లీగ్ కొనసాగుతుంది.
వచ్చే నెల 22న విజేతలను ప్రకటిస్తారు. అండర్-14, 60 ఏండ్లు పైబడిన సైక్లిస్టులు వ్యక్తిగతంగా 200 కిలోమీటర్లు, టీమ్లుగా 500 కిలోమీటర్లు చేయాల్సి ఉంటుంది. పాల్గొనేవారంతా ఆయా నగరాల్లోనే సైక్లింగ్ చేయాలి. వారంతా స్ట్రావా(ఎస్టీఆర్ఏవీఏ) యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలను నమోదు చేయాలి. సైక్లింగ్ ప్రారంభం కాగానే యాప్లో క్లిక్ చేస్తే సైక్లిస్ట్ రోడ్డు మార్గాలు, ఎన్ని కిలోమీటర్లు పూర్తి చేశారు? తదితర వివరాలన్నీ యాప్లో నిక్షిప్తమవుతాయి. ఇలా ప్రతీ టీం వివరాలను టెక్నాలజీతో హెచ్సీజీ మానిటర్ చేస్తుంది.
సైక్లింగ్కు ఆదరణ పెరుగుతోంది. ప్రతిఒక్కరికీ చిన్నతనంలో సైకిల్తో అనేక జ్ఞాపకాలు ఉంటాయి. కాలక్రమేణా దీని వినియోగం తగ్గుతుంది. వంద అడుగుల దూరానికి కూడా వాహనాలనే వినియోగిస్తున్నారు. సైక్లింగ్తోనే ఆరోగ్యంగా ఉంటాం. 80 శాతం వ్యాధులను రాకుండా అడ్డుకోగలం. దేశవ్యాప్తంగా సైక్లింగ్ వినియోగం పెరగాలని హైదరాబాద్ వేదికగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. హెచ్సీజీని ఏర్పాటు చేసి సైక్లింగ్పై అవగాహన కల్పిస్తున్నాం. -రవీందర్, ఫౌండర్, హెచ్సీజీ