అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్తోపాటు పలువురు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ వీరితో చర్చించారు. ఈ నెల 20న రాష్ట్రంలో కర్ఫ్యూ ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపు అంశంపైనా సీఎం చర్చించి సడలింపునకు నిర్ణయం తీసుకున్నారు.