జైపూర్ : రాజస్థాన్లోని బరన్ జిల్లాలో భర్తను కట్టేసి మహిళ(30)పై ఆమె మరిది సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాధిత జంట శనివారం బరన్ జిల్లాలోని బాలాజీ ఆలయానికి వెళ్లి బైక్పై తిరిగివస్తుండగా బరన్-అత్రు రాష్ట్ర రహదారిపై ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. వారిని బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి మహిళ భర్తను కట్టిపడేశారు. ఆపై మహిళను లైంగికంగా వేధించారు.
ఘటన అనంతరం బాధిత జంట సదర్ పోలీస్ స్టేషన్లో దినేష్ అనే వ్యక్తితో పాటు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినేష్ బాధిత మహిళ మొదటి భర్త సోదరుడని పోలీసులు వెల్లడించారు. గతంలో మహిళ, ఆమె మాజీ భర్త కుటుంబ సభ్యులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కాగా తాజా ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.