గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్/గార్ల, మే 17: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని దవాఖానల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నదని చెప్పారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా దవాఖానలో రూ.2.7 కోట్లతో 57 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన టీ డయాగ్నస్టిక్ హబ్ను, గార్ల దవాఖానలో ఆక్సిజన్తో కూడిన 20 పడకలను ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ.. మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ కొవిడ్ రోగులకు అవసరమయ్యే అత్యవసర మందు లు, ఆక్సిజన్ను అందించేందుకు నిత్యం పర్యవేక్షిస్తున్నదని చెప్పారు.