కరోనా కుటుంబాలను చిదిమేస్తున్న వేళ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ యువ వైద్యుడు 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు.పేదలకు బాసటగా నిలుస్తున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ దండె రాజు పట్టణంలో నాలుగేండ్లుగాదవాఖాన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో సేవలందిస్తూనే ప్రైవేట్ ప్రాక్టీసు ద్వారా పేదలకు తక్కువ ఖర్చులో వైద్యంచేస్తున్నారు. రెండు నెలలుగా కొవిడ్ పేషెంట్ల ఇండ్లకు వెళ్లి మరీ వైద్యం అందించి మన్ననలు పొందుతున్నారు. కరోనా కష్టకాలంలో పేదవారికి తక్కువ ఖర్చులో వైద్యం అందించాలని భావించి.. ఫీజు రూ.10 మాత్రమే తీసుకుంటున్నట్టు వైద్యుడు రాజు తెలిపారు.