హైదరాబాద్ : కరోనాతో ఓ హెడ్కానిస్టేబుల్ మృతిచెందాడు. నగరంలోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లో హసన్ అలీ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 19న కరోనా బారినపడ్డాడు. అమీర్పేట్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. ఘట్కేసర్లోని బాలాజీనగర్లో హసన్ అలీ నివాసం ఉంటున్నాడు.